Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో పురోగతి.. మురికి కాలువలో ఎముకలు లభ్యం!!

Anwarul Azim Anar

వరుణ్

, ఆదివారం, 9 జూన్ 2024 (15:03 IST)
బంగ్లాదేశ్‌కు చెందిన ఎఁపీ అన్వర్ అజీమ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ హత్య కేసులో బెంగాల్ పోలీసులు కొంత పురోగతి సాధించారు. మృతుడి ఎముకలను ఓ మురికి కాలువలో గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి కీలక అనుమానితుడిని నేపాల్‌లో అరెస్టు చేసిన పోలీసులు.. భారత్‌కు తీసుకువచ్చారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు గాలింపు చేపట్టిగా.. బాధితుడిగా భావిస్తోన్న శరీర భాగాల ఎముకలు లభ్యమయ్యాయి.
 
'వైద్యులు, ఫోరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో గాలింపు జరపగా.. ఆ కాలువలో మనిషికి సంబంధించిన ఎముకలు లభ్యమయ్యాయి. వాటిని ఫోరెన్సిక్‌ పరీక్ష కోసం పంపిస్తాం. ఇతర శరీర భాగాల కోసం గాలింపు కొనసాగుతుంది' అని పోలీసులు వెల్లడించారు. అంతకుముందు ఎంపీ శరీరానికి సంబంధించినగా భావిస్తున్న దాదాపు మూడున్నర కిలోల మాంసపు ముద్దను హత్య జరిగిన అపార్టుమెంట్ సెప్టిక్‌ ట్యాంకులోనే గుర్తించారు.
 
బంగ్లా ఎంపీని హత్య చేసిన అనంతరం అతడి శరీర భాగాలను ముక్కలుగా చేసి పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీటిలో కొన్ని ఇప్పటికే లభ్యం చేసుకున్నప్పటికీ.. అవి నిర్ధరించుకోవడం కష్టంగా మారింది. దీంతో డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం బాధిత ఎంపీ కుమార్తె బంగ్లాదేశ్‌ నుంచి కోల్‌కతాకు రానున్నారు. మరోవైపు, ఈ హత్య కోసం ఎంపీ సన్నిహితుడే నిందితులకు దాదాపు రూ.5 కోట్లు చెల్లించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీ 3.0 సర్కారు : ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి మరొకరికి ఛాన్స్!