ఆంధ్రప్రదేశ్‌లో మోడీ పర్యటన వాయిదా పడుతోందా?

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (11:51 IST)
భారత ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 6వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. ఇప్పటికే తెలుగుదేశం బీజేపీ వర్గాలు మోడీ పర్యటనపై  కత్తులు దూసుకుంటున్నాయి. ఏ మొహం పెట్టుకుని మోడీ ఆంధ్రప్రదేశ్‌కు వస్తారని తెలుగుదేశం వర్గాలు విమర్శిస్తుంటే.. గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది చెప్పడానికే మోడీ పర్యటనకు వస్తున్నారని బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. 
 
రాష్ట్రానికి నరేంద్రమోడీ అన్యాయం చేశారంటూ ప్రతిరోజూ గగ్గోలు పెడతున్న తెలుగుదేశం నేతలు తాజగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో మోడీ పర్యటనపై తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. అయితే జనవరి 6 వతేదీన ఏపీలో మోడీ పర్యటన వాయిదా పడ్డట్టు సమాచారం. అదే రోజు ప్రధాని కేరళ పర్యటన ఉన్నందున సమయాభావం మూలంగా మరొక తేదీ ఖరారు చేయడానికి ప్రధాని కార్యాలయ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 
 
ఈ మేరకు ఇప్పటికే ఏపీ బీజేపీ నాయకత్వానికి సమాచారం పంపింది ప్రధాని కార్యాలయం, అయితే ఆంధ్రప్రదేశ్  పర్యటనను యధావిధిగా ఉంచాలని కేరళ పర్యటనను వాయిదా వేయాలని ప్రధాని కార్యాలయ అధికారులను ఏపీ బీజేపీ నాయకత్వం కోరింది. అయితే అన్ని విషయాలు పరిశీలించి మోడీ పర్యటనను ఖరారు చేయనున్నారు ప్రధాని కార్యాలయం అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments