నేడు చిలకలూరిపేట ప్రజాగళం బహిరంగ సభ - పాల్గొంటున్న మోడీ - చంద్రబాబు - పవన్ కళ్యాణ్

ఠాగూర్
ఆదివారం, 17 మార్చి 2024 (09:49 IST)
దేశంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మరుసటి రోజే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరి పేటలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాగళం పేరుతో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ వేదికను పంచుకోనున్నారు. ఒక రాజకీయ వేదికకపై మోడీ, చంద్రబాబులు దాదాపు పదేళ్ల తర్వాత ఆశీనులుకానున్నారు. ఈ ఇద్దరు నేతలను ఒకే వేదికపై తీసుకొస్తున్న ఘనత మాత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కే దక్కుతుంది. 
 
పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారు. దాదాపు పదేళ్ల తర్వాత కూటమి భాగస్వాములు అందరూ ఒకే వేదికపైకి రానుండటంతో ఈ సభకు ప్రాధాన్యం పెరిగింది. 2024 ఎన్నికలకు సంబంధించి ఏపీలో ఇది తొలి ఎన్డీఏ సభ కావడం గమనార్హం. ఇటీవల బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. 
 
విజయవాడ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మార్చి 11న సుదీర్ఘ చర్చల అనంతరం మూడు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్రంలో ఆరు లోక్‌సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. టీడీపీ 17 లోక్‌సభ స్థానాల్లో 144 అసెంబ్లీ స్థానాల్లో బరిలో నిలుస్తుంది. 
 
ఇక జనసేన 2 లోక్‌సభ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. చంద్రబాబు నాయుడు ఇప్పటికే 128 మందితో ఎన్నికల అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. త్వరలోనే మిగతా పేర్లు కూడా వెల్లడించనున్నారు. ఇక జనసేన ఏడుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. బీజేపీ తన అభ్యర్థుల పేర్లు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dixit Shetty: ప్రేమ కథని మరో కోణంలో చూపించే ది గర్ల్ ఫ్రెండ్ - దీక్షిత్ శెట్టి

Chinmayi Vs Jani Master: జానీ మాస్టర్, ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్‌‌లపై విమర్శలు.. కర్మ వదిలిపెట్టదు..

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments