Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మొత్తం లోక్‌సభ స్థానాలు 543.. కానీ ఎన్నికలు నిర్వహించేది 544.. ఎలా?

PNR
ఆదివారం, 17 మార్చి 2024 (09:40 IST)
దేశంలో ఉన్న మొత్తం లోక్‌సభ స్థానాలు 543. ఈ స్థానాల్లో ఎన్నికల నిర్వహణ కోసం భారత ఎన్నికల సంఘం శనివారం నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో ఎన్నికలను 544 స్థానాల్లో నిర్వహించనున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా, 544 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన వివరణ ఇచ్చారు.
 
ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 19వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. అయితే, దేశంలో 543 లోక్‌సభ  స్థానాలు ఉంటే, ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌లో మాత్రం 544 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. దీనిపై పలువురు సందేహాలు వ్యక్తం చేయడంతో ఈసీ వివరణ ఇచ్చింది. 
 
దేశంలో కొత్త స్థానాలు ఏపీ ఏర్పాటు కాలేదన్నారు. అయితే, మణిపూర్‌లో ఇన్న మణిపూర్ స్థానానికి మాత్రం రెండు దశల్లో పోలింగ్ నిర్వహిస్తామన్నారు. తొలి విడత ఏప్రిల్ 19వ తేదీన, రెండో విడత 26వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఫలితంగా జాబితాలో ఒక లోక్‌సభ స్థానం అదనంగా కనిపించిందని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments