Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఆ సీట్లు నాకొదిలేయ్.. ప్రధాని మాటలతో బాబు షాక్

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోడీ ఏదో ఒక షాక్ ఇస్తూనే ఉన్నారట. ఏపీలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడ

Webdunia
బుధవారం, 17 జనవరి 2018 (15:46 IST)
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోడీ ఏదో ఒక షాక్ ఇస్తూనే ఉన్నారట. ఏపీలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడు నెలకో, రెండునెలలకో ఒకసారి ఢిల్లీకి వెళ్ళి ప్రధానిని కలిసి వస్తున్నారు. అయితే చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతోందట. ఈ సారి ఏకంగా చంద్రబాబునాయుడు ముందు ఒక ప్రపోజల్ పెట్టినట్టు సమాచారం. ఆ ప్రపోజల్ విన్న బాబు షాకై కొద్దిసేపు తేరుకోలేకపోయారట.
 
వచ్చే ఎన్నికల్లో లోక్‌సభ స్థానాల సీట్లన్నీ తమకు అప్పగించి.. అసెంబ్లీ స్థానాలన్నీ మీరే పోటీ చేసుకోండి.. ఇలా చేస్తే బాగుంటుందని ప్రధాని చెప్పారట. అయితే ఎంపీ సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుందన్న నమ్మకం బాబుకు ఉంది. ఇప్పటికే చాలామంది ఎంపిలు ఏపీ నుంచి ఉన్నారు. 
 
అలాంటిది మోడీ లోక్‌సభ స్థానాలన్నీ తమకే వదిలేయండి చెబితే బాబుకు ఏం చెప్పాలో అర్థంకాక సైలెంట్ అయిపోయారట. కాస్త ఆలోచించుకుని చెబుతానని ప్రధానికి సమాధానం చెప్పి బాబు బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. ఈసారి మోడీ ఏకంగా లోక్‌సభ స్థానాలకే ఎసరు పెట్టడం బాబుకు ఏ మాత్రం మింగుడుపడటం లేదట. మరోవైపు కేంద్రం వద్ద సాగిలపడి బాబు ప్రవర్తిస్తున్న తీరుపై మాత్రం ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments