Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మృతి - సంతాపం తెలిపిన జగన్ - బాబు

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (10:52 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్ కన్నుమూశారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకులోనై ఆస్పత్రిలో చేరిన ఆమె శుక్రవారం వేకువజామున 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. మరణవార్త తెలుసుకున్న వెంటనే ప్రధాని మోడీ హుటాహుటిన ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన స్వయంగా తల్లి పాడెమోశారు. తల్లిని కోల్పోయి బాధలో ఉన్న ప్రధాని మోడీకి పలువురు ప్రముఖులు తమ సానుభూతిని తెలుపుతున్నారు.
 
ప్రధాని మోడీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ కష్ట సమయంలో తమ ప్రార్థనలు మోడీ కుటుంబంతో ఉంటాయని చెప్పారు. హీరాబెన్ మోడీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాని ట్వీట్ చేశారు. 
 
అలాగే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. తల్లిని కోల్పోవడంతో ఎవరికైనా అత్యంత బాధాకరమని చెప్పారు. మాతృమూర్తిని కోల్పోయిన ప్రధాని మోడీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. మోడీ కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments