పామును ఆడిస్తూ... దాని కాటుతో వ్యక్తి మృతి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 19 జులై 2021 (09:57 IST)
ఓ ఇంటిలో పొంచి ఉన్న పామును పట్టుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించి పాము కాటుకు గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా చీరాల మండల పరిధిలోని విజయనగర్‌ కాలనీలో చోటుచేసుకుంది.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన తేళ్ల కుమారి ఇంటిలో శనివారం ఉదయం గోడలో తాచుపాము కనిపించింది. పామును ఒక్కసారిగా చూసి ఉలిక్కి పడిన ఆమె స్థానికు ల సహాయంతో అదే ప్రాంతం యానాది కాలనీకు చెందిన పాములు ప ట్టే సంజయ్‌(42)కు పామును బయటకు తెచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సంజయ్‌ ఇంటిలో ఉన్న సామాను మొత్తం బయటకు చేర్చాడు. ఈక్రమంలో పాము బండ్ల కిందకు చేరింది. ఎట్టకేలకు సుమారు ఏడు గంటల సమయానికి పామును ప ట్టుకుని బయటకు తెచ్చాడు. ఈక్రమంలో పామును బయటకు తెచ్చి కోరలు తొలగించకుండా ఆడిస్తున్న క్రమంలో పాము కాటుకు గురయ్యా డు.

స్థానికులు వెంటనే అతడిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు చేర్చగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడికి ఐదుగురు కు మార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం. ఈపురుపాలెం పోలీ స్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments