పామును ఆడిస్తూ... దాని కాటుతో వ్యక్తి మృతి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 19 జులై 2021 (09:57 IST)
ఓ ఇంటిలో పొంచి ఉన్న పామును పట్టుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించి పాము కాటుకు గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా చీరాల మండల పరిధిలోని విజయనగర్‌ కాలనీలో చోటుచేసుకుంది.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన తేళ్ల కుమారి ఇంటిలో శనివారం ఉదయం గోడలో తాచుపాము కనిపించింది. పామును ఒక్కసారిగా చూసి ఉలిక్కి పడిన ఆమె స్థానికు ల సహాయంతో అదే ప్రాంతం యానాది కాలనీకు చెందిన పాములు ప ట్టే సంజయ్‌(42)కు పామును బయటకు తెచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సంజయ్‌ ఇంటిలో ఉన్న సామాను మొత్తం బయటకు చేర్చాడు. ఈక్రమంలో పాము బండ్ల కిందకు చేరింది. ఎట్టకేలకు సుమారు ఏడు గంటల సమయానికి పామును ప ట్టుకుని బయటకు తెచ్చాడు. ఈక్రమంలో పామును బయటకు తెచ్చి కోరలు తొలగించకుండా ఆడిస్తున్న క్రమంలో పాము కాటుకు గురయ్యా డు.

స్థానికులు వెంటనే అతడిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు చేర్చగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడికి ఐదుగురు కు మార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం. ఈపురుపాలెం పోలీ స్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments