Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఈసీ నియామకంపై వేసిన పిటిషన్ విత్ డ్రా... ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (13:17 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్‌లో పూర్తి పత్రాలు లేనందున పిటిషనర్ మూర్తి ఉపసంహరించుకున్నారు. గురువారం నాడు జరిగిన విచారణలో పిటిషనర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టుకి తెలిపారు.

పూర్తి పత్రాలతో మరోసారి వ్యాజ్యం దాఖలుకు పిటిషనర్ అనుమతి కోరగా.. ఇందుకు హైకోర్టు అంగీకరించింది. దీంతో పిటిషన్ డిస్పోజ్ చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
 
కాగా.. ఇప్పటికే ఎస్‌ఈసీగా నీలంను కొనసాగించడాన్ని చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పలువురు పిటిషన్‌‌లు వేసిన విషయం విదితమే.

అంతేకాదు.. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అర్థం చేసుకోకుండా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా సాహ్ని రూ.160 కోట్లు వృథా చేశారని, ఆ సొమ్మును ఆమె నుంచి రాబట్టాలని కూడా కోర్టులను కోరడం జరిగింది.

మరోవైపు.. సాహ్ని కొనసాగింపునకు సంబంధించి దాఖలైన వ్యాజ్యంపై విచారణను ఈ నెల 28కి హైకోర్టు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments