Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి అనుమతి.. భూమిపూజ

Webdunia
సోమవారం, 24 జులై 2023 (09:20 IST)
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంతింటి నిర్మాణానికి స్థానిక ప్రభుత్వ అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో ఇంటి నిర్మాణానికి స్థానిక టీడీపీ నేతలు భూమిపూజ చేశారు. గత కొంతకాలంగా చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గంలో సొంతిల్లు లేదంటూ వైకాపా నేతలు ప్రచారం చేస్తూ వస్తున్నారు. వీరి నోటికి తాళం వేసేందుకు ఆయన సొంతిల్లును నిర్మించాలన్ని నిర్ణయించి, ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని అధికారులు ఇంతకాలం తొక్కిపెట్టి, తాజాగా అనుమతి ఇచ్చారు. 
 
దీంతో సొంత ఇంటిని నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో 99.77 సెంట్ల భూమిని గతంలో చంద్రబాబు సొంతంగా కొనుగోలు చేశారు. ఇది జాతీయ రహదారిని ఆనుకునివుంది. ఇందులో గృహ నిర్మాణం జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్నెల్ల క్రితం ఆయన దరఖాస్తు చేసుకోగా, ఇన్నాళ్లకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ నిర్మాణంతో సొంత నియోజకవర్గంలో సొంత ఇల్లు లేదన్న విమర్శలకు ఇక చెక్ పెట్టనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments