Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్లు వేయలేదని పింఛన్లు ఆపేశారు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (08:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలలు ఇటీవలే ముగిశాయి. ఈ ఎన్నికల్లో వైకాపా నేతలు అధికారుల అండతో రెచ్చిపోయారు. విజయమే లక్ష్యంగా ఓటర్లను బెదిరించారు. దీనికి పరాకాష్టగా తాము ఓడినచోట్ల ఇపుడు తమ ప్రతాపం చూపిస్తున్నారు. అధికారులను అడ్డుపెట్టుకుని.. లబ్దిదారులకు రావాల్సిన అన్ని రకాల ఫలాలు నిలిపివేస్తున్నారు.
 
తాజాగా, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని గోళ్ల, నార్పల మండలంలోని దుగుమర్రి, పెద్దవడుగూరు మండలం మజరా కొండూరులో పింఛన్లు రాకపోవడంతో పింఛనుదారులతోపాటు తెదేపా నాయకులు సోమవారం ప్రభుత్వ కార్యాలయాలవద్ద నిరసన తెలిపారు. కల్యాణదుర్గం మండలంలోని గోళ్ల పంచాయతీ పరిధిలో ప్రతి నెలా 424 మందికి పింఛను ఇచ్చేవారని, ఈ నెల మాత్రం 190 మందికే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఈ క్రమంలో తెదేపా నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదని భీష్మించారు. ఎస్‌ఐ సుధాకర్‌ సిబ్బందితో అక్కడికి చేరుకుని సర్ది చెప్పారు. ఈ విషయమై ఎంపీడీవో కొండన్నను వివరణ కోరగా.. విచారణ చేపట్టి అర్హులందరికీ పింఛన్‌ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. నార్పల మండల పరిధిలోని దుగుమర్రి గ్రామంలో 14 మందికి, పెద్దవడుగూరు మండలంలోని కొండూరులో ఇద్దరికి పింఛన్లు ఇవ్వకపోవడంతో పింఛనుదారులు ఆందోళనకు దిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments