Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న జాతిపిత.. నేడు సాయిబాబా... వైకాపా కేడర్ రంగుల పిచ్చి పీక్స్‌కు చేరింది...

Webdunia
శుక్రవారం, 29 నవంబరు 2019 (14:37 IST)
నవ్యాంధ్రలో వైకాపా కార్యకర్తల పిచ్చి పీక్స్ చేరింది. ఫలితంగా ప్రభుత్వ భవనాలతో పాటు... మనుషులతో పాటు దేవుళ్లను కూడా వైకాపా కార్యకర్తలుగా చేసేస్తున్నారు. మొన్నటికిమొన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి వైకాపా రంగులు వేసిన వైకాపా కేడర్.. ఇపుడు సాయిబాబా విగ్రహానికి కూడా వైకాపా జెండా కప్పేశారు. 
 
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుడిలో ఉన్న శిరిడీ సాయిబాబా విగ్రహానికి వైసీపీ జెండాను కట్టారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూజారులు స్పందిస్తూ, మరుసటి రోజే జెండాను తొలగించామని చెప్పారు. ఇకపై ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ గడ్డపై ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
 
నిజానికి నవ్యాంధ్రలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ వైకాపా రంగులు వేస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ జెండాకు, గాంధీ విగ్రహం దిమ్మెకు.... ఇలా అదీ, ఇదీ అనే తేడా లేకుండా రంగులు పూసేస్తున్నారు. తాజాగా సాయిబాబా విగ్రహానికి కూడా వైకాపా జెండా కప్పేశారు. అయితే, వీరి తీర్పు విపక్ష నేతలు ఎన్నో రకాలైన విమర్శలు గుప్పిస్తున్నా వైకాపా కేడర్ మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

తర్వాతి కథనం
Show comments