Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిగ్రీ కళాశాలల సమస్యల్ని తీర్చండి మ‌హాప్ర‌భో!

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (16:11 IST)
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు మొర‌పెట్టుకుంటున్నాయి. విజ‌య‌వాడ‌లోని ప్రసాదంపాడులో కళాశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ పోల భాస్కర్ కు పిడిఎస్ యు ప్రతినిధి బృందం వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. రామ్మోహన్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయన్నారు. 
 
 
ముఖ్యంగా ఆది కవి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో బుట్టాయిగూడెం, చింతూరు కేంద్రాల్లో గత నాలుగు సంవత్సరాల క్రితం స్థలం కేటాయించి భవనాల నిర్మాణం పూర్తి చేయలేదు. నిర్మాణాలు అసమగ్రంగా నిలిచి పోయాయ‌ని, వాటిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు, కొవ్వూరు డిగ్రీ కళాశాలలకు స్థలం కేటాయించి వెంటనే పూర్తిస్థాయి భవనాలు నిర్మించాలని అన్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పక్కా భవనాలు, అదనపు తరగతి గదులు నిర్మించాలని కోరారు. డిగ్రీలో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టాలని తెలిపారు. పశ్చిమ ఏజెన్సీ వెనుకబడ్డ బుట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పరీక్ష సెంటర్ కేటాయించాలని కమిషనర్ ను కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎ. రవిచంద్ర, నగర అధ్యక్షులు ఐ. రాజేష్ ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments