Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్వారంపూడికి "భీమ్లా నాయక్" ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తా : పవన్ కళ్యాణ్

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (21:13 IST)
వైకాపాకు చెందిన కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్‌కు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ద్వారంపూడి తన వైఖరిని మార్చుకోకుంటే భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తానంటూ హెచ్చరించారు. గుంటూరు జిల్లాలోని ఇచ్చంట గ్రామంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. 
 
"వైకాపా అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి గారికి ఓ విషయం చెప్పదలచుకున్నాను. మీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అనే వ్యక్తి అకారణంగా నన్ను పచ్చిబూతులు తిట్టారు. వినకూడని మాటలు అన్నాడు. అయినా నేను ఊరుకున్నాను. కానీ, మా జనసైనికులకు కోపాలు వచ్చాయి. 
 
పంతం నానాజీ వంటి నేతలకు కోపాలు వచ్చాయి. ఎందుకు ఇలా అన్నావంటూ వారు నిలదీయడానికి వెళితే వారిపై దాడులు చేశారు. నన్ను అన్న మాటలతో నాకు బాధ అనపించలేదు. కానీ, వీర మహిళలు వారు అనిపించుకున్న మాటలు నాకు చెబితే అయ్యో వీళ్లను ఎందుకు రాజకీయాల్లో దించాను అని బాధపడ్డాను. 
 
వైవీ సుబ్బారెడ్డిగారు... మీ  పెద్దవాళ్లు, విజ్ఞులు.. ఇలాంటి వారికి గడ్డిపెట్టండి. ఈ సందర్భంగా ద్వారంపూడికి చంద్రశేఖర్ కూడా చెబుతున్నాం. గతంలో మీ కుటుంబానికి ఎస్పీ డీటీ నాయక్ గారి ట్రీట్మెంట్ జరిగింది. భవిష్యత్‌లో కూడా మీరు ఇలాగే వ్యవహరిస్తే "భీమ్లా నాయక్" ట్రీట్మెంట్ అంటే ఏమిటో చూపిస్తా" అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments