అధికారం కంటే సమస్యలు తీర్చడమే ముఖ్యం : పవన్ కళ్యాణ్

తనకు అధికారం కంటే రైతు, బడుగు, బలహీన వర్గాల సమస్యలు తీర్చడమే ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖీ సమావేశం నిర్వ

Webdunia
శనివారం, 27 జనవరి 2018 (18:51 IST)
తనకు అధికారం కంటే రైతు, బడుగు, బలహీన వర్గాల సమస్యలు తీర్చడమే ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖీ సమావేశం నిర్వహించారు. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ, జ‌న‌సేన పార్టీకి ఓటేయ‌మ‌ని తాను అడ‌గ‌నని, తనకు గెలవడం కంటే కూడా రైతుల సమస్యలు తీర్చడమే ముఖ్యమన్నారు. తనకు రైతు రాజైతే చాలని, తనకు అదే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. అత్య‌ధిక క‌ర‌వు మండ‌లాలు ఉన్న జిల్లా అనంతపురమని అన్నారు. కరవు సమస్యలంటూ ప్రభుత్వాలు ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతున్నాయని, ఇందుకోసం అన్ని విభాగాలు ఉన్నాయని, కానీ అవి స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ‌డం లేదని ఆరోపించారు.
 
గెలుపు ఓటములు తనకు కొత్త కావని పవన్ కల్యాణ్ అన్నారు. రైతు రాజు కావాలని, బానిస కాకూడదని, రైతుల తరపున తాను పోరాడతానని చెప్పారు. ఇక ప్రభుత్వాలతో గొడవలు పెట్టుకునే ఉద్దేశం తనకు లేదని, కానీ, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరానికి కృషి చేస్తానని అన్నారు. 
 
అంతకుముందు ఆయన అనంతపురంలోని స్థానిక గుత్తి రోడ్డులో జనసేన తొలి కార్యాలయానికి భూమి పూజ చేశారు. జిల్లాలో కరవుపై అధ్యయనం చేయడం కోసమే తాను ఈ యాత్ర చేస్తున్నట్లు, ఎలాంటి సమస్యలు ఉన్నా పాలకులతో మాట్లాడి, పరిష్కారానికి కృషిచేస్తానని తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments