Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జగనన్న ఇళ్ళు - పేదలందరికీ కన్నీళ్లు' పరిశీలనలో పవన్ కళ్యాణ్

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2022 (11:42 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైకాపా ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తూర్పారబడుతూ ప్రజలకు తెలియజేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులోభాగంగా, ఆయన "జగనన్న కాలనీలు పేదలందరికీ కన్నీళ్లు" అనే కార్యక్రమం పేరుతో జగనన్న కాలనీల పరిశీలనకు శ్రీకారం చుట్టారు. 
 
గత రెండు రోజులుగా విశాఖపట్టణంలోనే ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ నేతలతో కలిసి ఆదివారం ఉదయం విశాఖ నుంచి విజయనగరం జిల్లా గుంకలంలో జగనన్న కాలనీల సందర్శనకు బయలుదేరారు. ఈ సందర్భంగా, జగనన్న కాలనీలు.. పేదల కన్నీళ్లు అనే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 
 
వైజాగ్ నుంచి పార్టీ నేతలతో కలిసి రోడ్డు మార్గంలో విజయనగరం బయలుదేరిన పవన్ కళ్యాణ్‌కు గుంకలాంలో జనసేన శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసి ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్‌కు దారిపొడవునా స్వాగత సత్కారాలను ఏర్పాటు చేశారు. దారి వెంట తనకు అందుతున్న స్వాగత సత్కారాలను జనసేనాని స్వీకరిస్తూ పవన్ ముందుకు సాగుతున్నారు. ఆయన ఆదివారం మధ్యాహ్నానికి గుంకలాంకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన జగనన్న కాలనీని పవన్ పరిశీలిస్తారు. 
 
అలాగే, విశాఖ నుండి విజయనగరం జిల్లా, గుంకలాం గ్రామంలో "జగనన్న ఇళ్ళు - పేదలందరికీ కన్నీళ్లు" కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆనందపురంలో ప్రజలు, జనసైనికులు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలను క్రేన్ సాయంతో  పవన్‌కు వేశారు. 

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments