Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌కు షాకివ్వనున్న పవన్.. ఓయూలో విద్యార్థి గర్జనకు హాజరవుతారా?

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (13:18 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ షాకిచ్చేలా వున్నారు. ఏపీ రాజకీయాల్లో దూకుడును ప్రదర్శిస్తున్న జనసేన అధినేత... తెలంగాణలోని జరుగుతున్న పరిణామాలు, ఘటనలపై అప్పుడప్పుడు స్పందిస్తున్నారు. అయితే త్వరలోనే తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు కాబోతున్న ఓ సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
జనవరి 5న ఉస్మానియా యూనివర్శిటీలో జరుగనున్న జనసేన విద్యార్థి గర్జనకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తెలంగాణలోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్... పరోక్షంగా కేసీఆర్ సర్కార్‌ను టార్గెట్ చేశారు. ఆ తరువాత ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కేసీఆర్, కేటీఆర్‌ను కలుస్తానని తనను కలిసిన ఆర్టీసీ కార్మికులను హామీ ఇచ్చారు. 
 
కానీ అలా జరగలేదు. తాజాగా ఆయన ఓయూలో జరగబోయే విద్యార్థి గర్జనకు పవన్ కళ్యాణ్ వస్తారని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా గళం వినిపిస్తారా ? లేక ఈ సభకు దూరంగా ఉంటారా అన్నది ? ఇంకా తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments