Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం నెక్ట్స్ ప్లాన్ ఏంటి? పవన్‌ జేఏసీ ఎంతవరకు వచ్చింది?

ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంటులో వివిధ రూపాల్లో నిరసన తెలిపిన నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చే దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తదుపరి చర్యలపై ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఇందు

Webdunia
ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (12:37 IST)
ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంటులో వివిధ రూపాల్లో నిరసన తెలిపిన నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చే దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తదుపరి చర్యలపై ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఇందులో భాగంగా తదుపరి చర్యలపై చంద్రబాబు నాయుడు పార్లమెంట్ సభ్యులను సలహా అడిగారు. ఈ మేరకు ఎంపీలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. 
 
రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని  జాతీయ స్థాయిలో గొంతెత్తి  చాటారని విషయాన్ని కొనియాడారు.  అదే స్ఫూర్తితో తదుపరి సమావేశాల్లోనూ నిరసనలు తెలిపి.. డిమాండ్లను సాధించుకురావాలని పిలుపు నిచ్చారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌కు కేంద్రం సానుకూల సంకేతాలు పంపిందనే విషయాన్ని ఓ ఎంపీ ప్రస్తాలించారు. 
 
జోన్, హోదాకు బదులుగా ఇస్తామన్న ప్యాకేజీ, విద్యాసంస్థలు, రాజధానికి నిధులు తదితర విషయాలపై చంద్రబాబుతో చర్చించారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వుండాలని చంద్రబాబు ఆదేశించారు.  
 
మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్‌తో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలపై వీరిద్దరూ చర్చిస్తారని జనసేన వర్గాలు తెలిపాయి. ఇప్పటికే జేఏసీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వున్న పవన్.. అందులో లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్‌లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments