బాబు కంటతడిపెట్టడం బాధ కలిగించింది... సిగ్గుతో తలదించుకోవాలి : పవన్

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (19:25 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టడం బాధ కలిగించిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంటీవలికాలంలో కొందరు నేతలు వాడుతున్న భాష, మాటలు సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. 

 
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల పట్ల అధికార పార్టీకి చెందిన సభ్యులు అమర్యాదగా మాట్లాడటం అత్యంత శోచనీయమన్నారు. గతంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా కొందరు తక్కువ చేసి మాట్లాడినపుడు కూడా తాను ఇలానే ఖండించానని గుర్తుచేశారు. 

 
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్లు మహిళల గురించి మాట్లాడేటపుడు జాగ్రత్తగా వహించాలని హితవు పలికారు. మహిళల గౌరవ మర్యాదలకు హాని కలిగించే ధోరణులను జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, లేకపోతే అంటువ్యాధిలా ప్రబలే అవకాశం ఉందని పవన్ పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments