ఆంధ్రా ప్రజలకు పౌరుషం లేదా? పవన్ కళ్యాణ్

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (15:25 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రా ప్రజల పౌరుషంపై స్పందించారు. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిలదీయాలని లేనిపక్షంలో ఏపీ ప్రజలకు పౌరుషం లేదని అనుకుంటారంటూ వ్యాఖ్యానించారు. 
 
రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్ల అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నేతృత్వంలో మంగళవారం విజయవాడ వేదికగా అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా అన్యాయంగా విభజించారన్నారు. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని... రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని సూచించారు. ఎవరు ఎన్ని చెప్పినా... రాష్ట్రానికి అన్యాయం జరిగిన విషయం మాత్రం వాస్తవమని చెప్పారు. 
 
రాష్ట్రానికి కేంద్రం ఎంత ఇవ్వాలనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. అదే సమయంలో రాష్ట్ర కోసం మాజీ ఎంపీ ఉండవల్లి చేస్తున్న కృషి గొప్పదని కొనియాడారు. ఎప్పుడో జరిగిపోయిన విభజన గురించి ఉండవల్లి ఇప్పుడెందుకు లేవనెత్తుతున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారని... భవిష్యత్తు తరాల కోసం పార్టీలకతీతంగా అందరూ ఏకతాటిపైకి రావాలని పవన్ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మౌనంగా ఉండటం సరికాదని... మనం మౌనంగా ఉంటే ఏపీ ప్రజలకు పౌరుషం లేదని అనుకుంటారని చెప్పారు. 
 
ఇపుడు ఎవరు ఏ లెక్కలు చెప్పినా.. రాష్ట్రానికి అన్యాయం జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అందువల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై అన్ని రాజకీయ పార్టీలూ స్పందించాలన్నారు. ఇప్పుడు గొంతెత్తకపోతే భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడతారన్నారు. ఉండవల్లి ప్రవేశపెట్టిన తీర్మానానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments