Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల వద్దకు వెళ్లకుండా ఉండేందుకే చీకటి జీవో : పవన్ కళ్యాణ్

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (15:10 IST)
వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వైకాపా నేతలకు పట్టుకుందని, అందుకే విపక్ష పార్టీల నేతలు ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకునేందుకు చీకటి జీవో నంబరు 1ని తీసుకొచ్చారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఆయన ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును హైదరాబాద్ నగరంలో ఆయన నివాసంలో కలుసుకున్నారు. వీర్దదరూ సుధీర్ఘంగా సమావేశమయ్యారు. 
 
ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచక పాలన సాగిస్తున్నారన్నారు. పెన్షన్లు తొలగింపు, ఫీజు రీయింబర్స్‌మెంట్, శాంతిభద్రతలు లోపించడం, రైతులకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, ఇసుక అక్రమ రవాణా, డ్రగ్స్ మాఫియా వంటి అంశాలపై చర్చించినట్టు తెలిపారు. 
 
పైగా, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపకుండా ఉండేందుకు, విపక్ష నేతలు ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకునేందుకు వీలుగా జీవో నంబర్ 1 ను తీసుకొచ్చారని ఆరోపించారు. ఇలాంటి చెత్త జీవోలను తీసుకురావడాన్ని ఆపాలని బలంగా నిర్ణయించుకున్నామని తెలిపారు. 
 
ఈ జీవో తీసుకుని రావడానికి ముందే తనను వైజాగ్‌లో అడ్డుకున్నారని, వాహంలో నుంచి దిగకూడదు, ప్రజలకు అభివాదం చేయకూడదు.. గదిలోనుంచి బయటకు రాకూడదు ఇలా అనేక ఆంక్షలు విధించారని పవన్ మండిపడ్డారు. ఇపుడు జీవో నంబర్ 1 ను తీసుకొచ్చి, పోలీసుల అండతో చంద్రబాబును అడ్డుకున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments