Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలంటీర్లను గత వైసిపి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది: పవన్ కల్యాణ్

సెల్వి
గురువారం, 7 నవంబరు 2024 (18:30 IST)
Pawan kalyan
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరు విప్పారు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచలతోనే కూటమి ప్రభుత్వం ఉందన్నారు. గత ప్రభుత్వం వారిని మోసం చేసిందన్నారు. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయొచ్చు.. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు.. ఇదో సాంకేతిక సమస్య అంటూ తేల్చి చెప్పారు. 
 
ఎన్నికల ప్రచార సమయంలో వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని టీడీపీ, జనసేన కార్యకర్తలు, నేతలూ ఆరోపించారు. వారి వాదనకు బలం చేకూర్చుతూ.. కొంతమంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ వైసీపీకి తరపున ప్రచారం చేశారు. 
 
ఐతే.. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారనీ, తాముగా అలా చెయ్యలేదని అన్నారు. అయితే అమరావతిలో జరిగిన సర్పంచ్ సంఘాల సమావేశంలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ స్పందించారు. 
 
వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సర్పంచులు కోరగా.. అందుకు పవన్ ఒప్పుకోలేదు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ఉంది అన్నారు. తద్వారా వాలంటీర్లకు ప్రభుత్వం ఇప్పటికీ అనుకూలంగానే ఉంది అనే సంకేతం ఇచ్చారు.
 
వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని గ్రామ సర్పంచి పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్​పై స్పందించారు. సచివాలయ సిబ్బందిని గ్రామ పంచాయతీ పరిధిలోకి తెచ్చేందుకు అభ్యంతరం లేదన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments