Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాదకద్రవ్యాల హబ్‌గా ఆంధ్రప్రదేశ్ : పవన్‌ కల్యాణ్‌

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (11:34 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాదకద్రవ్యాల హబ్‌గా మారిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఏపీలోని గంజాయి ప్రభావం దేశవ్యాప్తంగా పడుతోందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. 
 
‘‘గంజాయి నివారణకు నేతలు చర్యలు తీసుకోవట్లేదు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతంలో 2018లో నా పోరాటయాత్రలో గంజాయిపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆ సమయంలో పోరాటయాత్ర చేశాను. ఏవోబీలో గంజాయి మాఫియాపై.. నిరుద్యోగం, అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఫిర్యాదులొచ్చాయి’’ అని పవన్‌ అన్నారు. 
 
ఏపీలో గంజాయి మూలాలున్నాయంటూ హైదరాబాద్‌ సీపీ, నల్గొండ ఎస్పీలు చేసిన వ్యాఖ్యల వీడియోలను పవన్‌ ట్వీట్లకు జత చేశారు. నిజానికి గత 2018లోనే ఏపీ-ఒడిస్సా బోర్డరులో గంజాయి రవాణ, మాఫియా వంటి అంశాలు తన దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. డ్రగ్స్ మూలాలు ఏపీలోనే ఉన్నాయంటూ హైదరాబాద్ సీపీ నల్గొండ ఎస్పీ ప్రకటనల క్లిప్పిగులను ట్వీట్టర్లో పోస్ట్ చేయడం ఇపుడు సంచలనంగా మారింది.
 
నిజానికి ఏపీ గంజాయి, డ్రగ్స్ విక్రయాలకు అడ్డాగా మారిందని టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై విలేకరుల సమావేశంలో ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. దీంతో టీడీపీ నేతలపై ఏపీ ప్రభుత్వం వరుసగా కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్న విషయంతెల్సిందే. మరి ఇపుడు పవన్‌పై కూడా అదేవిధంగా కేసులు పెడుతుందా? అనే చర్చ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments