రణస్థలం వేదికగా జనసేన యువశక్తి - పోస్టర్ ఆవిష్కరించిన పవన్

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (19:31 IST)
జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరిట భారీ బహిరంగ సభ జరుగనుంది. స్వామి వివేకానందుడి స్ఫూర్తిగా తీసుకుని ఈ సభను నిర్వహిస్తున్నట్టు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ యువశక్తి సభకు సంబంధించిన పోస్టరును ఆయన సోమవారం ఆవిష్కరించారు. 
 
స్వామి వివేకానంద జయంతి రోజున, ఆయన స్ఫూర్తితో ఈ నెల 12వ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనికి యువతీ యువకులంతా ఆహ్వానితులేనని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని యువగళం వినిపించేలా ఈ యువశక్తి సభ ఉంటుందని తెలిపారు. 
 
దేశానికి వెన్నెముక యువతేనని, ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం మనదేనని చెప్పారు. అయితే, ఉత్తారాంధ్రలో యువత చదువులకు, ఉద్యోగ, ఉపాధఇ అవకాశాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొనివుందన్నారు. 
 
ఈ నేపథ్యంలో వలసలు, విద్య, వ్యాపారాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై యువత తమ అభిప్రాయాలు తెలియజేసేలా ఈ యువశక్తి సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభలో తాము మాట్లాడటం కాదని, యువత అభిప్రాయాలను వారి నోటి ద్వారానే చెప్పేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments