Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తే నరకానికి వెళ్లరు... పవన్ కళ్యాణ్ : నెలంతా ఘనాహారం బంద్.. (video)

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (15:18 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్తీకమాస దీక్ష చేపట్టారు. దీంతో నెల రోజుల పాటు ఆయన ఘనాహారాన్ని స్వీకరించబోనని చెప్పారు. ఈ నెల రోజుల పాటు కేవలం ద్రవాహారమే తీసుకుంటానని తెలిపారు. అదేసమయంలో కార్తీక మాసంలో మొక్కలను నాటడం వల్ల నరకానికి వెళ్లరని శ్రీ వరాహ పురాణంలో వేద వ్యాసుడు పేర్కొన్నాడని, అందువల్ల ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 
 
హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న తన వ్యవసాయక్షేత్రంలో ఆయన వన రక్షణ పేరుతో వన సంరక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఒక్కో రావి, వేప, మర్రి మొక్క.. పది రకాల పూల మొక్కలు.. ఐదు మామిడి మొక్కలు, రెండేసి దానిమ్మ, నారింజ మొక్కలు నాటినవారు నరకానికి వెళ్లరు. వేద వ్యాసుడు రాసిన 'శ్రీ వరాహ పురాణం'లో ఈ విషయం ఉందని ఆయన వెల్లడించారు. 
 
ముఖ్యంగా, భూదానం, గోదానం వల్ల ఎంత పుణ్యం వస్తుందో మొక్కలను నాటి సంరక్షించడం వల్ల అంతే పుణ్యం వస్తుందని ఈ పురాణం చెబుతోందన్నారు. అలాగే, కార్తీక మాసంలో నిర్వహించే వన భోజనాలు వర్గ, కుల భోజనాలు కాకూడదని అన్నారు. అన్ని వర్గాల వారు కలిసి వన సంరక్షణ దిశగా వేసే వన సమారాధన వేదికలు కావాలని పిలుపునిచ్చారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments