Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానికి పవన్ కళ్యాణ్‌ లేఖ... సమాధానం ఇవ్వకుంటే?

పవన్ కళ్యాణ్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ జెఎఫ్‌సి. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం సైలెంట్‌గా ఉండటం, ఎన్నికలకు ముందు ప్రధాని ఆంధ్రకు ఇచ్చిన హామీలు ఇవన్నీ తెలుసుకునేందుకు జెఎఫ్‌‌సిని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్‌. ఇది అందరికీ తెలిసిందే. జెఎఫ

Webdunia
శుక్రవారం, 2 మార్చి 2018 (18:28 IST)
పవన్ కళ్యాణ్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ జెఎఫ్‌సి. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం సైలెంట్‌గా ఉండటం, ఎన్నికలకు ముందు ప్రధాని ఆంధ్రకు ఇచ్చిన హామీలు ఇవన్నీ తెలుసుకునేందుకు జెఎఫ్‌‌సిని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్‌. ఇది అందరికీ తెలిసిందే. జెఎఫ్‌‌సిలో జయప్రకాష్‌ నారాయణ్, ఉండవల్లి అరుణ్‌ కుమార్ కూడా ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన ఈ కమిటీ కేంద్రప్రభుత్వం ఎపికి ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని ఒక అభిప్రాయానికి వచ్చింది.
 
20 పేజీలలో కేంద్రం ఎపికి ఇచ్చిన హామీలను పవన్ కళ్యాణ్‌ ఇప్పటికే సిద్ధం చేశారు. తన కమిటీలోని వారందరూ కలిసి కూర్చుని మొత్తం చర్చించి కేంద్రంపై ఒక లేఖను వదలనున్నారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎపికి ఇచ్చిన హామీలు.. నెరవేర్చని తీరును స్పష్టంగా పవన్ కళ్యాణ్‌ ఆ లేఖలో రాయనున్నారు. 
 
మొత్తం 20 పేజీల లేఖను ప్రధానికి స్వయంగా పంపనున్నారు. ఈ హామీలను ఎప్పటిలోగా నెరవేరుస్తారో చెప్పాలని కూడా అందులో స్పష్టంగా రాశారు. ఒకవేళ సమాధానం రాకుంటే మాత్రం ఏ విధంగా ముందుకెళ్ళాలో కూడా ఒక నిర్ణయానికి పవన్ కళ్యాణ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంమీద పవన్ ప్రధానికి లేఖ రాయనుండటం మాత్రం తీవ్ర చర్చకు దారితీస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments