Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప ఎన్నిక : తిరుపతిలో పవన్ కళ్యాణ్ వీధివీధిలో పాదయాత్ర

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (07:19 IST)
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక త్వరలో జరుగనుంది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్‌ 3వ తేదీన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తిరుపతిలో పర్యటిస్తారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. ఎంఆర్‌పల్లి సర్కిల్‌ నుంచి శంకరంబాడీ వరకు పవన్‌కల్యాణ్‌ పాదయాత్ర ఉంటుందని చెప్పారు. పాదయాత్ర తర్వాత పవన్‌ బహిరంగ సభలో మాట్లాడతారని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. పవన్‌ రెండో విడత పర్యటన నెల్లూరు జిల్లాలో ఉంటుందని నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. 
 
అలాగే, తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొనే అవకాశం ఉంది. బైబిల్‌ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలంటూ కొద్ది రోజుల కిందట ఆయన చేసిన ప్రకటన ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించారు. పక్కా హిందూత్వ వాదిగా ముద్రపడిన  సంజయ్‌కి తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఈ ప్రకటనతో అభిమానులు పెరిగారు. 
 
ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన తిరుపతిలో సంజయ్‌‌లాంటి నాయకుల ప్రచారం తమకు గట్టి ఊతమిస్తుందని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రచారంలో పాల్గొనాలంటూ మూడు రోజులుగా ఆయనపై ఏపీ బీజేపీ నేతలు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌ 14న తిరుపతిలో నిర్వహించే భారీ ర్యాలీలో సంజయ్‌ పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments