Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు గంటల పాటు కాలినడక.. దీక్షను విరమించనున్న పవన్ కల్యాణ్

సెల్వి
బుధవారం, 2 అక్టోబరు 2024 (08:50 IST)
Pawan Kalyan
ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 5గంటల కాలినడక తర్వాత కొండపైకి చేరుకున్నారు.  రాత్రికి అక్కడే బస చేశారు. డిప్యూటీ సీఎం బసకు, దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లను స్థానిక నేతలు, టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. 
 
పవన్ కల్యాణ్ మరికాసేపట్లో బస చేసిన అతిథి గృహం నుంచి శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఇందుకు టీటీడీ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. అనంతరం దీక్ష విరమిస్తారు.
 
బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు. ఆయన వెంట అధికారులు, వ్యక్తిగత భద్రత సిబ్బంది సైతం మెట్ల మార్గంలో తిరుమల కొండకు చేరుకున్నారు. 
 
పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలినడక మార్గంలో కొండపైకి చేరుకున్న సమయంలో ఆయన స్నేహితుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సైతం ఆయన వెంట ఉన్నారు. 
 
ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించిన సమయంలో పవన్ వెంట ఉన్న ఆయన దీక్ష విరమించే సమయంలో కూడా పక్కనే ఉండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైకలాజికల్ థ్రిల్లర్ కలి మూవీ నుంచి రొమాంటిక్ మెలొడీ సాంగ్

టాప్ 250 భారతీయ చిత్రాల జాబితాను ప్రకటించిన ఐఎండీబీ

సినిమా విడుదలయ్యాక వారం తర్వాత రివ్యూలపై రచ్చ?

ముంబై నటి జత్వానీ కేసు : ఐపీఎస్‌ల ముందస్తు బెయిల్ పిటిషన్లు

నాటి సినిమా హాలులు నేటి మల్లీప్లెక్స్ ల కబుర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..

తర్వాతి కథనం
Show comments