Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ - సంఘీభావం తెలిపిన జనసేనాని

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (12:39 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసానికి సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం వెళ్లారు. హైదరాబాద్ నగరంలో వీరిద్దరి భేటీ జరిగింది. తన నివాసానికి వచ్చిన పవన్‌కు చంద్రబాబు ఇంటి గుమ్మం వద్దకు ఎదురెళ్ళి స్వాగతం పలికారు. వీరిద్దరూ ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. 
 
ముఖ్యంగా, ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటన సందర్భంగా వైకాపా ప్రభుత్వం తెచ్చిన నల్ల జీవో నంబర్ 1ని సాకుగా చూపి చిత్తూరు జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చంద్రబాబు పర్యటనను అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబును పవన్ కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు కుప్పంలో పోలీసులు సృష్టించిన అరాచకాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక బలోపేతానికి ఐక్య కార్యాచరణ రూపొందించే అంశంపై వీర్దదరూ చర్చించనున్నట్టు తెలుస్తోంది. 
 
కొన్ని నెలల క్రితం విజయవాడలోని ఓ హోటల్‌లో సమావేశమైన వీరిద్దరు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు, నిర్ణయాలపై ఐక్యంగా పోరాటం చేయాలని ఇప్పటికే వీరిద్దరూ నిర్ణయించిన విషయంతెల్సిందే. ఇపుడు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1పై తాజా భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments