Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చనిచెట్లను నరికేవాళ్లు - ఆడబిడ్డపై అత్యాచారం చేసేవాళ్లు నాశనమైపోతారు...

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (10:42 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఉన్న ఆదివారం రైల్వేకోడూరులో జరిగిన సభలో నిప్పులు చెరిగారు. 
 
నవ్యాంధ్రలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017లో కర్నూలు జిల్లాలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ కళాశాలలో ఓ అమ్మాయి మరణించిందని, ఆమెపై అఘాయిత్యం జరిగిందని ఆమె తల్లి చెబితే కళ్లవెంబడి నీళ్లు వచ్చాయని గుర్తుచశారు. ఆ ఆడబిడ్డను చంపిన వాళ్ల కేసును జగన్ రెడ్డి ఎందుకు బయటికి తీయడంలేదని నిలదీశారు. వాళ్లను ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
 
'పోలీసులు ఏంచేస్తున్నారక్కడ... వాళ్లకు లేరా ఆడబిడ్డలు, రాజకీయ నాయకులకు లేరా ఆడబిడ్డలు.. ఆ ఆడబిడ్డను చంపేసిన వెధవలకు లేరా ఆడబిడ్డలు... అడిగేవాళ్లు లేరా?" అంటూ తీవ్రస్వరంగా ప్రసంగించారు. 
 
అంతేకాకుండా, జిల్లాలో బత్తాయి తోట నరికివేతను ప్రస్తావిస్తూ, పచ్చనిచెట్లను నరికేవాళ్లు, పద్నాలుగేళ్ల ఆడబిడ్డపై అత్యాచారం చేసినవాళ్లకు ఆ ఉసురు ఊరికేపోదని హెచ్చరించారు. నాశనం అయిపోతారని, రోజులు లెక్కబెట్టుకోండని తీవ్రస్వరంతో వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments