Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేసిన జనసేన నేతలు.. కేసు నమోదు

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2022 (15:05 IST)
సినీ నటుడు, వైకాపా నేత, ఏపీ చలనచిత్ర అభివృద్ధి మండలి ఛైర్మన్ పోసాని కృష్ణమురళిపై జనసైనికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన వీరమహిళలను కించపరిచేలా పోసాని వ్యాఖ్యలు చేశారంటూ జనసైనికులు ఆరోపించారు. ఇదే అంశంపై వారు రాజమండ్రి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు పోసానిపై 354, 355, 500, 504, 506, 507, 509 సెక్షన్ల కేసు నమోదు చేశారు. 
 
తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పోసాని కించపరిచేలా, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజమండ్రి ఒకటో నంబరు పోలీస్ స్టేషన్‌లో తొలుత ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి... కేసు నమోదు చేయలేదు. 
 
దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. జనసైనికులు వేసిన పిటిషిన్‍‌పై విచారణ జరిపిన కోర్టు... జనసేనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. పోసానిపై తక్షణం కేసు నమోదు చేయాలంటూ పోలీసులను కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయక తప్పలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments