Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేసిన జనసేన నేతలు.. కేసు నమోదు

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2022 (15:05 IST)
సినీ నటుడు, వైకాపా నేత, ఏపీ చలనచిత్ర అభివృద్ధి మండలి ఛైర్మన్ పోసాని కృష్ణమురళిపై జనసైనికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన వీరమహిళలను కించపరిచేలా పోసాని వ్యాఖ్యలు చేశారంటూ జనసైనికులు ఆరోపించారు. ఇదే అంశంపై వారు రాజమండ్రి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు పోసానిపై 354, 355, 500, 504, 506, 507, 509 సెక్షన్ల కేసు నమోదు చేశారు. 
 
తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పోసాని కించపరిచేలా, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజమండ్రి ఒకటో నంబరు పోలీస్ స్టేషన్‌లో తొలుత ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి... కేసు నమోదు చేయలేదు. 
 
దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. జనసైనికులు వేసిన పిటిషిన్‍‌పై విచారణ జరిపిన కోర్టు... జనసేనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. పోసానిపై తక్షణం కేసు నమోదు చేయాలంటూ పోలీసులను కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయక తప్పలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments