ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయత్ రాజ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం 4:45 గంటలకు అలిపిరి శ్రీవారి పాదాల నుండి కాలినడకన తిరుమలకు లాంఛనంగా పాదయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా భారీ సంఖ్యలో మద్దతుదారులు, కార్యకర్తలు, పోలీసు సిబ్బందితో కలిసి, కళ్యాణ్ కొండెక్కడం ప్రారంభించారు. ఈ యాత్ర తిరుమల ఆధ్యాత్మిక-సాంస్కృతిక విలువలకు ప్రాధాన్యమిచ్చే రీతిలో వుంటుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక అలిపిరిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో ఫోటోలు దిగేందుకు ఆయన అభిమానులు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో తన అభిమానులకు సెల్ఫీలు ఇస్తూనే.. కొండపైకి నడుచుకుంటూ ముందుకు సాగుతున్నారు.