Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యామిలీ కోసం వీరాభిమాని సైకిల్ యాత్ర

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (12:02 IST)
తెలుగు చిత్రపరిశ్రమను శాసిస్తున్న మెగా ఫ్యామిలీ బాగుండాలని, దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి పీడ విరగడై పోవాలని కోరుతూ తిరుపతిలోని బలిజపల్లికి చెందిన ఈశ్వరయ్య సైకిల్ యాత్ర చేశాడు. 
 
ఈ నెల 10వ తేదీన శ్రీవారి పాదాల చెంత అయిన అలిపిరి వద్ద నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వరకు సాగింది. 
 
ఈ సైకిల్ యాత్రపై ఈశ్వరయ్య మాట్లాడుతూ, గతంలో కూడా మెగా ఫ్యామిలీ కోసం అనేక పూజలు, పునస్కారాలు చేసినట్టు చెప్పారు. ముఖ్యంగా, తిరుమల, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాల వద్ద పొర్లుదండాలతో మొక్కులు తీర్చుకున్నట్టు చెప్పారు. 
 
తాను ఒక పవన్ కల్యాణ్ వీరాభిమానని, తమ అభిమాన నేతకు కరోనా సోకడంతో కలత చెంది ఆయనతో పాటు ఈ దేశ ప్రజలంతా బాగుండాలని కోరుకుంటూ సైకిల్ యాత్రను చేపట్టినట్టు తెలిపారు. ఈ యాత్ర విజయవంతంగా ముగియడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments