Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల వెల్లడి

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (11:49 IST)
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం ఉదయం ఎంసెట్ ఫలితాలను వెల్లడించారు. కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఎంసెట్‌ 2021ని ఆ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఎట్టకేలకు సజావుగా నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేసింది. దీంతో విద్యార్థులు ఫలితాలను తెలుసునేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 
కాగా, ఈ ఎంసెట్ ఫలితాలను హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈనెల 30 నుంచి రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రారంభంకానుంది. ఈ ఏడాది జరిగిన ఎంసెట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌ పరీక్షకు 90 శాతం మంది హాజరుకాగా… అగ్రికల్చర్‌, మెడికల్‌ ఎంట్రన్స్‌కు 91.19 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
 
కరోనా రెండో దశ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది కరోనా కారణంగా ఇంటర్‌ పరీక్షలను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ ప్రక్రియలో ఇంటర్‌ వెయిటేజ్‌ను ఎత్తివేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇంటర్‌లో వచ్చిన మార్కుల వెయిటేజ్‌ను తీసుకునే వారు. కానీ కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయడంతో ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. 
 
ఎంసెట్ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇంటర్‌లో 45 శాతం మార్కులు ఉంటేనే ఇంజనీరింగ్ సీటు పొందే అవకాశం ఉండేది. కానీ పరీక్షలు రద్దు కావడంతో ఇప్పుడు ఎంసెట్‌లో అర్హత సాధించిన వారందరూ కౌన్సెలింగ్‌కు అర్హులేనని అధికారులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments