Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తిన బాటపట్టిన పవన్ కళ్యాణ్ - రేపు ఢిల్లీకి సీఎం జగన్

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (08:02 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సినీ నటుడు పవన్ కళ్యాణ్ హస్తిన బాటపట్టారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌లో ఉండగా, రేపు ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా అటు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు హస్తినబాట పట్టారు.
 
కొత్త పీసీసీ చీఫ్‌ను.. కొత్త కమిటీలను ప్రకటించిన తర్వాత తొలిసారి అందరితో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్‌ గాంధీతో టి.కాంగ్రెస్‌ నేతలు భేటీ కానున్నారు. 
 
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇపుడు ఆసక్తిని రేపుతోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. మొదట ప్రహ్లాద్ జోషితో సమావేశంకానున్న ఆయన.. ఆ తర్వాత తన పర్యటనలో పలువురు బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది. 
 
ఇదిలావుంటే, ఢిల్లీలో తెరాస భవన్ నిర్మాణ ప్రారంభోత్సవానికి ఈ నెల ఒకటో తేదీన వెళ్లిన సీఎం కేసీఆర్... వారం రోజులుగా అక్కడే మకాం వేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా.. కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, గజేంద్ర సింగ్ షెకావత్‌ తదితరలను కలిశారు. వారం రోజుల తర్వాత బుధవారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments