Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవో నం.1పై చర్చ కోరితే టీడీపీ సభ్యులపై దాడి చేస్తారా? పవన్ కళ్యాణ్ ప్రశ్న

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (16:22 IST)
ఏపీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఏడో రోజైన సోమవారంలో అసెంబ్లీ సాక్షిగా టీడీపీకి చెందిన దళిత ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిపై వైకాపా ఎమ్మెల్యే సుధాకర్‌తో పాటు మరికొందరు దాడి చేసినట్టు సమాచారం. ఈ దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. జీవో నం.1పై చర్చ కోరితే టీడీపీ సభ్యలపై దాడి చేస్తారా అంటూ ఆయన మండిపడ్డారు. 
 
ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలను దురదృష్టకరమైనవి, ప్రజూస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేవిగా ఉన్నాయన్నారు. ప్రజల గొంతు నొక్కే జీవో నంబర్ 1పై చర్చను కోరిన టీడీపీ ఎమ్మెల్యేలపై అధికారపక్షం దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలని ఆయన కోరారు. 
 
ఇలాంటి ఘటనలో ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయన్నారు. ముందుగా చట్ట సభల గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత సభా నాయుకుడిగా ముఖ్యమంత్రిపైనా, సభ ప్రిసైండిగ్ అధికారిపైనా ఉందని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments