Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలనాటి రచనల డిజిటలైజేషన్‌కు పవన్ సాయం

Webdunia
సోమవారం, 16 మార్చి 2020 (08:40 IST)
రాజమహేంద్రవరంలో పేరుగాంచిన గౌతమీ గ్రంథాలయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సంద‌ర్భంగా గ్రంథాలయంలో ఉన్న పుస్తకాల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

గ్రంథాలయ కార్యాలయంలో ఘనాపాటి, పండితులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, నారాయణరావు, రంగనాథ్ తదితరులతో ముచ్చటించారు. గ్రంథాలయంలో ఉన్న తాళపత్ర గ్రంథాలను, రాగి రేకుల మీద వేసిన శాసనాలను, 1771 కాలంలో ప్రచురితమైన పుస్తకాలు, సంస్కృత బైబిల్‌ను పవన్ ఆసక్తిగా తిలకించారు.

తాళపత్రాలు రచించే ఘంటాన్ని పరిశీలించారు. ఘంటంతో లిఖించే విధానాన్ని అక్కడ పండితులను అడిగి తెలుసుకున్నారు. శిష్టా ఆంజనేయశాస్త్రి పుస్తకాల‌పై వాకబు చేశారు. మాటల సందర్భంలో గ్రంథాలయ డిజిటలైజేషన్ ప్రక్రియ గురించి నిర్వాహకులు వివరించారు.

చారిత్రక పుస్తకాలను భవిష్యత్ తరాలకు అందించే ఈ ప్రక్రియ తమకు శక్తికి మించిన భారంగా మారిందని తెలిపారు. డిజిటలైజేషన్ వివరాలు తెలుసుకున్న పవన్ అందుకు అయ్యే మొత్తం తాను భరిస్తానని మాటిచ్చారు.

ఈ సందర్భంగా విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి శాలువా కప్పి పవన్‌ను  సత్కరించారు. కార్య‌క్ర‌మంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యుడు కందుల దుర్గేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments