Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్నాడు జిల్లా : వైకాపా నేత గడ్డి వాములో పెట్రోల్ బాంబులు!!

ఠాగూర్
గురువారం, 30 మే 2024 (10:38 IST)
పల్నాడు జిల్లాలో వైకాపా నేతకు చెందిన గడ్డి వాములో దాచిపెట్టిన పెట్రోల్ బాంబులను గుర్తించారు. ఈ గ్రామంలో బుధవారం పోలీసులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో గడ్డి వాములో దాచిన పెట్రోల్ బాంబులను గుర్తించారు. మొత్తం నాలుగు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. కౌంటింగ్‌ రోజు అలజడులు సృష్టించేందుకు వాటిని దాచి ఉంచారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 
 
ఇదే గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్‌ 21న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి రోడ్డుషో నిర్వహిస్తుండగా వైకాపా వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. రోడ్డుకు అడ్డంగా వైకాపా ప్రచార వాహనాలను నిలిపి.. ఇదేమిటని అడిగిన టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. అదేరోజు రాత్రి రెండింటి ప్రాంతంలో గ్రామంలోని టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఇప్పటికైనా గ్రామంలో అల్లర్లకు పాల్పడేవారిని బైండోవర్‌ చేయకపోతే కౌంటింగ్‌ రోజు దాడులు చేసే అవకాశముందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. గడ్డివాము పరిసరాల్లోని నివాసితులను విచారిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై రాజేష్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments