Webdunia - Bharat's app for daily news and videos

Install App

నామినేషన్ వేశారనీ.. చేపల చెరువులో విషం కలిపారు... ఎక్కడ?

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (08:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో అధికార వైకాపాకు చెందిన నేతలు, కార్యకర్తల ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేస్తున్న ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులపై దాడులకు దిగుతున్నారు. ఏకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ బెదిరింపులకు దిగడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం పి.దొంతమూరులో 9వ వార్డుకు తెలుగుదేశం పార్టీ మద్దతుతో కమ్మర సూర్యామణి అనే మహిళ నామినేషన్‌ వేశారు. దీన్ని జీర్ణించుకోలేని వైకాపా కార్యకర్తలు ప్రతీకార చర్యకు పాల్పడ్డారు. 
 
ఆమె భర్త అబ్బులు తమకున్న ఎకరం పొలంలో చేపల చెరువు తవ్వి చేపల పెంపకం నిమిత్తం నక్కబోయిన సన్యాసిరావుకు ఏడాదికి రూ.60 వేలకు లీజుకిచ్చారు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ చెరువులో విషం కలిపారు.
 
దీంతో చేపలు భారీగా చనిపోయి సుమారు రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లింది. దీంతో సన్యాసిరావు భార్య చంద్రకాంతం బుధవారం గుండెపోటుతో మరణించారు. దీంతో కలత చెందిన సూర్యామణి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. 

సంబంధిత వార్తలు

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments