Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్నాడులో 144 సెక్షన్... ఛలో ఆత్మకూరుకు పర్మిషన్ లేదు : గౌతం సవాంగ్

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (11:13 IST)
తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ఛలో ఆత్మకూరుకు ఎలాంటి అనుమతులు లేవని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. అదేసమయంలో పల్నాడులో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. వైకాపా కార్యకర్తల దాడుల్లో గాయపడిన టీడీపీ శ్రేణులకు అండగా నిలబడేందుకు టీడీపీ ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేపట్టే ఊరేగింపులకు అనుమతులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
 
ఇకపోతే, కర్నూలు జిల్లా హోసూరులో ఉద్రిక్తతలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. మొహర్రం సందర్భంగా కర్నూలు ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. మహిళలపై లాఠీచార్జిని ఖండిస్తున్నట్టు వెల్లడించారు. మహిళలపై లాఠీచార్జి కారణంగా ప్రజలే తిరగబడి పోలీసుల వాహనాలు దగ్ధం చేసే పరిస్థితి వచ్చిందని, రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు ఇదే నిదర్శనమన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని, ముందస్తు అప్రమత్త చర్యలు చేపట్టాలని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం