Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళంలో ఘోరం : రోడ్డు ప్రమాదంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ దుర్మరణం

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (08:38 IST)
శ్రీకాకుళం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. పలాస ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో పాటు ఆయన కుమారుడు దుర్మరణం పాలయ్యారు. ఆయన భార్య, కుమార్తె తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు నియంత్రణ కోల్పోయి వంతెన రక్షణ గోడను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌గా మడే రమేశ్ (45) వైద్యాధికారిగా పని చేస్తున్నారు. ఈయనకు భార్య లక్ష్మి (45), కుమార్తె సైర్య (14), కుమారుడు సంకల్ప్ (10)లు ఉన్నారు. అయితే, వీరంతా ఒక కారులో విశాఖ నుంచి పలాసకు బయలుదేరారు. 
 
ఈ కారు శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెదనాయుడు పేట వద్ద జాతీయ రహదారిపై వారి కారు అదుపుతప్పి వంతెన రక్షణ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. దీంతో డ్రైవర్ సీటులో ఉన్న రమేష్, ఆయన కుమారుడు సంకల్ప్‌లు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, లక్ష్మి, సైర్యలు తీవ్రంగా గాయపడ్డారు. 
 
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన లక్ష్మ సైర్యలను శ్రీకాకుళం ఆస్పత్రి తరలించారు. నిద్ర మత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments