Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుంజువాన్ ఆర్మీ క్యాంపు దాడికి ప్రతీకారం తప్పదు : నిర్మలా సీతారామన్

జమ్మూకాశ్మీర్‌లో సుంజువాన్‌ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారం తప్పదని కేంద్ర రక్షణ నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. ఈ దాడిలో ఐదుగురు భారత జవాన్లు మృతిచెందిన విషయం తెల్సిందే. దీనిపై ఆమె

Webdunia
మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (11:33 IST)
జమ్మూకాశ్మీర్‌లో సుంజువాన్‌ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారం తప్పదని కేంద్ర రక్షణ నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. ఈ దాడిలో ఐదుగురు భారత జవాన్లు మృతిచెందిన విషయం తెల్సిందే. దీనిపై ఆమె స్పందిస్తూ, ఈ దుస్సాహసంపై పాకిస్థాన్ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.
 
పాకిస్థాన్ వెనకేసుకొస్తోన్న జేఈఎమ్ ఉగ్రదాడికి ప్రణాళిక రూపొందించిందన్నారు. ప్రతి దాడులు జరిపిన భారత ఆర్మీ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిందని చెప్పారు. ఈ ఉగ్రదాడి ఎవరు చేశారన్న దానిపై తాము ఇప్పటికే ఆధారాలు సంపాదించామని, పాక్ ప్రభుత్వానికి వాటిని పంపుతామని చెప్పారు.
 
తాము ఆధారాలు పంపుతున్నప్పటికీ పాక్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, అయినప్పటికీ తాము ఈ సారి కూడా ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి భారత్ ధీటుగా జవాబు ఇస్తూనే ఉందని చెప్పారు. అంతకు ముందు ఆమె జమ్మూలోని మిలటరీ హాస్పిటల్‌కి వెళ్లి సుంజువాన్ ఉగ్రదాడిలో గాయాలపాలైన వారిని కలిశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments