Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

ఠాగూర్
సోమవారం, 7 ఏప్రియల్ 2025 (15:17 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా 30 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరుకాలేకపోయారు. పవన్ కళ్యాణ్ సోమవారం విశాఖ, మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలకు వెళ్లారు. పవన్ రాకతో పోలీసులు అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆయన ప్రయాణించే మార్గాల్లో ఏ ఒక్క వాహనానికి కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 
 
ముఖ్యంగా, సోమవారం జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షకు విశాఖలో తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి కొందరు విద్యార్థులు బయలుదేరారు. అయితే, పవన్ రాక కారణంగా ఆ మార్గంలో వాహనాలను నిలిపివేశారు. దీంతో ఆ 30 మంది విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయారు. దీంతో వారు పరీక్షను రాయలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు బోరున విలపిస్తూ, తమ పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments