Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

ఠాగూర్
సోమవారం, 7 ఏప్రియల్ 2025 (15:17 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా 30 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరుకాలేకపోయారు. పవన్ కళ్యాణ్ సోమవారం విశాఖ, మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలకు వెళ్లారు. పవన్ రాకతో పోలీసులు అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆయన ప్రయాణించే మార్గాల్లో ఏ ఒక్క వాహనానికి కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 
 
ముఖ్యంగా, సోమవారం జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షకు విశాఖలో తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి కొందరు విద్యార్థులు బయలుదేరారు. అయితే, పవన్ రాక కారణంగా ఆ మార్గంలో వాహనాలను నిలిపివేశారు. దీంతో ఆ 30 మంది విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయారు. దీంతో వారు పరీక్షను రాయలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు బోరున విలపిస్తూ, తమ పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments