Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్ - చిరు రాజకీయాల్లోకి వచ్చారు.. ఏం పీకారు? : బాలకృష్ణ

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన కామెంట్స్ చేశారు. అదీకూడా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. సినీ నటులు రాజకీయా

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (11:00 IST)
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన కామెంట్స్ చేశారు. అదీకూడా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. సినీ నటులు రాజకీయాల్లో రాణించడం అంత తేలిక కాదన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'రాజకీయాల్లో రాణించడం ఒక్క నందమూరి తారక రామారావు గారికే సాధ్యమైంది. అమితాబ్ బచ్చన్ ఉన్నాడు.. ఏం పీకాడు రాజకీయాల్లోకి వచ్చి? ఉత్తరప్రదేశ్‌లోని అహ్మదాబాద్‌లో బహుగుణ గారిని ఓడించి ఈయన పార్లమెంట్‌కు వెళ్లాడు తప్పా. పార్లమెంట్‌లో ఆటోగ్రాఫ్‌లు, ఫొటోలు దిగడానికి తప్పితే ఎందుకు పనికొచ్చాడు? ఇక్కడ చిరంజీవి పరిస్థితి ఏమైంది?.. ఆర్టిస్ట్ అనేవాడు రాజకీయాల్లోకి రావొద్దని నేను సలహా ఇస్తున్నా’ అని అన్నారు. 
 
‘మీరు హిందూపురానికి ఎమ్మెల్యే కదా, మరి, రాజకీయాల్లో మీరెలా..’ అని ప్రశ్నించే లోపే బాలకృష్ణ స్పందిస్తూ, ‘మేము వేరు.. మా బ్లడ్ వేరు.. క్రెడిబిలిటీ ఉండాలి. సినిమా స్టార్ అయితే సరిపోదు. వేరే హీరోలు సినిమాల్లో చెప్పేవి డైలాగ్స్. నా విషయంలో అలా కాదు. నేనేం మాట్లాడాలనుకున్నానో అదే మాట్లాడతా. నాకు ఎవరైనా నచ్చితే నమస్కారం పెడతా, లేదంటే వాడు టాటా అయినా బిర్లా అయినా సరే, కేర్ చేయను. నా స్వభావమే అంత. నాది మా నాన్న బ్లడ్. నా సినిమాల క్యారెక్టర్ల ప్రభావమే నా స్వభావానికి కారణం’ అని బాలయ్య అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments