Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేడు విశ్వవిద్యాలయాల బంద్

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (11:57 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం విశ్వవిద్యాలయాల బంద్‌కు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి సంఘం జేఏసీ పిలుపునిచ్చింది. బాసరలోని ట్రిపుల్ ఐటీ విద్యాలయంలో సురేష్ అనే మొదటి సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నట్టు జేఏసీ ప్రకటించింది. 
 
పైగా, ఈ విద్యార్థి మృతికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సురేష్ మృతి ప్రభుత్వ హత్యేనని, విద్యార్థి కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రం, బాసరలో ఉన్న ట్రిబుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని సురేష్‌గా గుర్తించారు. హాస్టల్‌లోని తన గదిలోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. డిచ్ పల్లికి చెందిన సురేష్‌గా గుర్తించారు.  
 
అయితే, ఈ విద్యార్థి ఓ యువతిని ప్రేమిస్తూ వచ్చాడని, ఈ ప్రేమ వ్యవహారం కారణంగానే ఆత్మహత్య చేసుకునివుంటాడని సహచర విద్యార్థులు అనుమానిస్తున్నారు. ఉరివేసుకున్న స్థితిలో సురేష్‌ను గుర్తించిన సహచర విద్యార్థులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్టు వెల్లడించారు. ఈ విద్యార్థి ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments