Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేడు విశ్వవిద్యాలయాల బంద్

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (11:57 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం విశ్వవిద్యాలయాల బంద్‌కు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి సంఘం జేఏసీ పిలుపునిచ్చింది. బాసరలోని ట్రిపుల్ ఐటీ విద్యాలయంలో సురేష్ అనే మొదటి సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నట్టు జేఏసీ ప్రకటించింది. 
 
పైగా, ఈ విద్యార్థి మృతికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సురేష్ మృతి ప్రభుత్వ హత్యేనని, విద్యార్థి కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రం, బాసరలో ఉన్న ట్రిబుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని సురేష్‌గా గుర్తించారు. హాస్టల్‌లోని తన గదిలోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. డిచ్ పల్లికి చెందిన సురేష్‌గా గుర్తించారు.  
 
అయితే, ఈ విద్యార్థి ఓ యువతిని ప్రేమిస్తూ వచ్చాడని, ఈ ప్రేమ వ్యవహారం కారణంగానే ఆత్మహత్య చేసుకునివుంటాడని సహచర విద్యార్థులు అనుమానిస్తున్నారు. ఉరివేసుకున్న స్థితిలో సురేష్‌ను గుర్తించిన సహచర విద్యార్థులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్టు వెల్లడించారు. ఈ విద్యార్థి ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments