Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళంలో ఎలుగుబంటిని పట్టేశారు...

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (14:51 IST)
గత కొన్ని రోజులుగా భయభ్రాంతులకు గురిచేస్తూ వచ్చిన ఎలుగుబంటిని శ్రీకాకుళం అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ ఎలుగుబంటు గత కొన్ని రోజులుగా సంచరిస్తూ హల్చల్ చేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. దీన్ని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు శతవిధాలా ప్రయత్నించారు. ఇన్ని రోజులు చిక్కకుండా తప్పించుకుని తిరగసాగింది. 
 
ఈ క్రమంలో గన్ సాయంతో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని పట్టుకున్నారు. ఈ ఎలుగుబంటిని జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం కడిసింగిలోని పశువుల పాకలో ఉండగా స్థానికులతో కలిసి అధికారులు బోనులో బంధించారు. 
 
కాగా, ఆదివారం కిడిసింగి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడిపై ఎలుగు దాడి చేయడంతో అతను ప్రాణాలు విడిచాడు. అలాగే, వజ్రపుకొత్తూరు సంతోషిమాత ఆలయంలోని జీడితోటలో పశువుల కోసం రేకుల షెడ్డు వేస్తుండగా ఎలుగుబంటి ఏడుగురిపై దాడి చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు మృతిచెందగా.. ఆరుగురు శ్రీకాకుళంలోని మెడికేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments