ఏకాంతం కోసం వస్తే ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (10:13 IST)
వారిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించారు కూడా. ఇంతలోనే ప్రియుడు కళ్ళముందే ప్రియురాలు అత్యాచారానికి గురైంది. కొద్దిసేపు ఏకాంతంగా గడిపేందుకు వచ్చిన సమయంలో ఈ దారుణం జరిగింది. ఈ దారుణం ప్రకాశం జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రకాశం జిల్లా చీరాల పట్టణం విఠల్‌ నగర్‌‌కు చెందిన ఓ యువతి (25)కి మూడేళ్ల క్రితం వివాహం కాగా, ప్రస్తుతం భర్త నుంచి విడాకులు పొంది, తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆమె ఓ దుకాణంలో పని చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడి అది వారిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. 
 
వీరిద్దరూ శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో కారంచేడు సమీపంలోని వంతెన వద్దకు వెళ్లి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో మరో బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు వారిని నిర్బంధించారు. వారి సెల్‌ఫోన్, దగ్గరున్న డబ్బు దోచుకున్నారు. 
 
ఆ తర్వాత యువకుడుని ఓ చెట్టుకు కట్టేసి.. యువతిని లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఆ తర్వాత కామాంధులు పారిపోయి. అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసును నమోదు చేశామని, నిందితులను పట్టుకునేందుకు ముగ్గురు ఎస్సైల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments