Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (12:08 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఆదివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కాశ్మీర్‌లో భారత భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఆదివారం ఉదయం భీకర కాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేశాయి.  
 
సోపోర్ జిల్లా మల్మన్ పొర ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ గాలింపు చేపట్టింది. కార్డన్ సెర్చ్ చేపట్టడంతో టెర్రరిస్టులు ఫైరింగ్ చేశారు. దీంతో భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులు చేశాయి. చాలా సేపు ఎన్‌కౌంటర్ కొనసాగింది. 
 
ఈ ఘటనలో ఓ టెర్రరిస్టును హతమార్చింది ఆర్మీ. మరోవైపు ఓ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. శనివారం సాయంత్రం షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌటర్‌లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఉగ్రవాదులు ఇంకా అక్కడే ఉండడంతో గాలింపు జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం