Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (12:08 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఆదివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కాశ్మీర్‌లో భారత భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఆదివారం ఉదయం భీకర కాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేశాయి.  
 
సోపోర్ జిల్లా మల్మన్ పొర ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ గాలింపు చేపట్టింది. కార్డన్ సెర్చ్ చేపట్టడంతో టెర్రరిస్టులు ఫైరింగ్ చేశారు. దీంతో భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులు చేశాయి. చాలా సేపు ఎన్‌కౌంటర్ కొనసాగింది. 
 
ఈ ఘటనలో ఓ టెర్రరిస్టును హతమార్చింది ఆర్మీ. మరోవైపు ఓ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. శనివారం సాయంత్రం షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌటర్‌లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఉగ్రవాదులు ఇంకా అక్కడే ఉండడంతో గాలింపు జరుగుతోంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం