Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్‌లో చొరబడిన ఉగ్రవాదులు... హైఅలెర్ట్?

Advertiesment
Andhra Pradesh
, బుధవారం, 22 మే 2019 (13:11 IST)
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడికానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని జిల్లాల్లో పోలీసులు గస్తీని ముమ్మరంచేశారు. అలాగే, హోటళ్లు, లాడ్జీల్లో కొత్తవారు దిగితే వెంటనే సమాచారం అందించాలని యాజమాన్యాలను ఆదేశించారు. 
 
అలాగే నగరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ముఖ్యంగా నౌకాశ్రయాలు లక్ష్యంగా దాడులు జరిగే అవకాశముందన్న సమాచారంతో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పన్నపూడి పాతవూరు సమీపంలో మత్స్యకారులకు అనుమానాస్పద పడవ ఒకటి లభ్యమైంది. 
 
ఆ బోటుపై శ్రీలంక అని రాసి ఉంది. దీంతో జాలర్లు పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల శ్రీలంకలో ఐసిస్ అనుబంధ సంస్థగా ఉన్న నేషనల్ తౌహీద్ జమాత్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడి 258 మందిని చంపేసిన విషయం తెల్సిందే. దీంతో ఆ సంస్థకు చెందిన ఉగ్రవాదులే భారత్‌లోకి ప్రత్యేక బోట్ ద్వారా ప్రవేశించి ఉంటారని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర వర్గాలు కోస్తాతీర రాష్ట్రాల పోలీసులను హెచ్చరించాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓట్ల లెక్కింపు ఎలా చేపడుతారు?