Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుయా ఆస్పత్రి ఘటనకు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణం

Webdunia
గురువారం, 20 మే 2021 (13:24 IST)
చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలోని పేరొందిన రుయా ఆస్పత్రిలో కరోనా మృతులు చనిపోవడానికి కారణంగా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని పలువురు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. 
 
టీడీపీ నేత పీఆర్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ఫిర్యాదు ఇచ్చినా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని వాదించారు. కలెక్టర్, డీఎంహెచ్ఓ ఆక్సిజన్ సమయానికి అందలేదని చెప్పారని... ఇది నిర్లక్ష్యమేనని న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. 
 
బాధ్యులపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ ఘటనలో 36 మంది చనిపోతే ప్రభుత్వం 11 మందేనని చెబుతోందని... న్యాయ విచారణకు ఆదేశించాలని వాదనలు వినిపించారు. కేంద్రం ఇచ్చిన ఐదు ప్లాంట్లను నేటి వరకు నెలకొల్పలేదన్నారు. 
 
వాదనలు విన్న కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తిరుపతి ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. వేసవి సెలవుల అనంతరం కోర్టు ప్రారంభమైన తొలిరోజుకి విచారణ జరుగనుంది. కాగా, ఈ ఘటనలో మృతుల లెక్కపై ఇప్పటికీ స్పష్టమైన క్లారిటీ లేని విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments