Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుయా ఆస్పత్రి ఘటనకు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణం

Webdunia
గురువారం, 20 మే 2021 (13:24 IST)
చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలోని పేరొందిన రుయా ఆస్పత్రిలో కరోనా మృతులు చనిపోవడానికి కారణంగా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని పలువురు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. 
 
టీడీపీ నేత పీఆర్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ఫిర్యాదు ఇచ్చినా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని వాదించారు. కలెక్టర్, డీఎంహెచ్ఓ ఆక్సిజన్ సమయానికి అందలేదని చెప్పారని... ఇది నిర్లక్ష్యమేనని న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. 
 
బాధ్యులపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ ఘటనలో 36 మంది చనిపోతే ప్రభుత్వం 11 మందేనని చెబుతోందని... న్యాయ విచారణకు ఆదేశించాలని వాదనలు వినిపించారు. కేంద్రం ఇచ్చిన ఐదు ప్లాంట్లను నేటి వరకు నెలకొల్పలేదన్నారు. 
 
వాదనలు విన్న కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తిరుపతి ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. వేసవి సెలవుల అనంతరం కోర్టు ప్రారంభమైన తొలిరోజుకి విచారణ జరుగనుంది. కాగా, ఈ ఘటనలో మృతుల లెక్కపై ఇప్పటికీ స్పష్టమైన క్లారిటీ లేని విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments