Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరాతక తండ్రి-రెండోసారీ ఆడశిశువు పుట్టిందని.. తొట్టెలో పడేసి చంపేశాడు..

Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (10:39 IST)
ఆధునికత పెరిగినా.. ఆడశిశువులపై అఘాయిత్యాలకు బ్రేక్ పడటం లేదు. ఉన్నత విద్యలు చదువుకున్నా.. ఆడశిశువులపై కొందరు చిన్నచూపు చూస్తూనే వున్నారు. ఆడపిల్ల పుడితే ఇంట లక్ష్మీదేవీ పుట్టిందని భావిస్తారు. కానీ మరికొందరు ఆడపిల్లను భారంగానే భావిస్తున్నారు. పుట్టకముందే కడుపులోనే కొందరు హతమారుస్తుంటే.. మరికొందరు పుట్టాక పసిప్రాణాల్ని తీసేస్తున్నారు. 
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలాంటి దారుణ ఘటనే వెలుగుచూసింది. చర్ల మండలం రేగుంటలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. పుట్టి నెలరోజులే అయిన ఆడ శిశువును తండ్రి హతమార్చాడు. రెండో సంతానంగా అమ్మాయి పుట్టిందనే కర్కశంతో నీటి తొట్టెలో పడేసి ప్రాణాలు తీసేశాడు. 
 
తొలి కాన్పులోనూ ఆడబిడ్డ పుట్టగా, రెండో బిడ్డ కూడా ఆడశిశువే జన్మించడంతో అతి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కసాయి తండ్రి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments